telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో బారులు తీరిన భక్తులు

tirumala temple

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు.

శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం, టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 88,753 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

Related posts