ఏపీ సర్కార్ పై పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో తాము అభివృద్ధి పనులు చేస్తే, వైసీపీ సర్కారు మాత్రం విధ్వంసం సృష్టిస్తోందని ఆయన అన్నారు. 14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిన్న జూమ్ యాప్ లో మాట్లాడిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బాటలు పరిచారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చాం, సాగునీరు ఇచ్చాం, విద్యా సంస్థలు పెట్టాం. ప్రజా రాజధానిలో అభివృద్ధికి ప్రభుత్వ వెబ్ సైటే సాక్ష్యమని దేవినేని వ్యాఖ్యానించారు. మాది అభివృద్ధి, వైసీపీది విధ్వంసమని దుయ్యబట్టారు.