telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గండికోట నిర్వాసితుల పరిహారం చెల్లింపులో జాప్యం: దేవినేని

devineni on power supply

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తమ ట్విట్ట‌ర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. కడపలో గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారం కోసం రోడ్డెక్కి ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్న దృశ్యాల‌ను ఆయన ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కొండాపురం మండలంలో గండికోట జలాశయం నిర్మించగా ఇందులో ముంపునకు గురైన ప‌లు గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారని, అయితే పరిహారం పంపిణీ చేయలేదని ఆయా ప్రాంతాల‌ మ‌హిళ‌లు తెలిపారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాల‌కు సంబంధించిన వీడియోల‌ను పోస్ట్ చేసి, దీనికి స‌మాధానం చెప్పాల‌ని జ‌గ‌న్ ను దేవినేని డిమాండ్ చేశారు.

Related posts