విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటివరకు కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.12 మంది చనిపోయి వేలాది మంది నిరాశ్రయులైతే, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు లేవు.
మీరు చెప్పే పేరున్న మంచి ఎల్జీ కంపెనీలో అలారం మోగదు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడంలేదో ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.