telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖలో జరిగిన రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?: దేవినేని

devineni on power supply

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా అని దేవినేని ఉమ ప్రశించారు. ఆ ప్రాంతాన్ని పాలనా రాజధానిగా ప్రకటించకముందు గత ఏడాది 55,221 రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన ఆయన వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

విశాఖలో  ఇప్పటికీ యథేచ్ఛగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా? అని అమరావతి రైతులు, సంఘాలు ప్రశ్నిస్తున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ‌’పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా? 3 మండలాల్లోనే జరిగిన 27 వేల క్రయవిక్రయాల వెనుక పెద్దలు ఎవరు?మీ నేతలు కొన్న భూములు అమ్ముకోవడానికే పాలనా రాజధానా? ఏది ఇన్సైడర్ ట్రేడింగ్? అని నిలదీశారు.

Related posts