మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ… పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇసుక విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఓ భవన నిర్మాణ కార్మికుడు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. ఘటనను ఎవరైనా తీవ్రంగా ఖండించాల్సిందేనని మేము కూడా ఇప్పటికే ఖండించాం అని అన్నారు. కానీ దీన్ని టీడీపీకి, బలమైన బీసీ నాయకుడైన కొల్లు రవీంద్రకు అపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో అన్యాయంగా రవీంద్రను 53రోజులు సెంట్రల్ జైలులో పెట్టినా మీ కక్ష తీరినట్టు లేదని అన్నారు. మళ్లీ తనకు సంబంధం లేని కేసులో ఇరికించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక మాఫియా అగడాలతో ఇసుక అందుబాటులో లేని కారణంగా భవన నిర్మాణ కార్మికుల్లో అశాంతి వచ్చిందని 52 మంది ఆత్మహత్య చేసుకున్నారు, మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశారు అబూ అన్నారు.
previous post
next post