వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ వాలంటీర్లు బాధ్యతతో వ్యవహరించకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారని అన్నారు. జగన్ సర్కార్ లో మంత్రులంతా డమ్మీలు అయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పిచ్చి పరాకాష్ఠకు చేరిందని దుయ్యబట్టారు.
హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి