ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అమరావతిని శ్మశానంతో పోల్చారంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని శ్మశానంగా పోల్చారంటే 34 వేల ఎకరాల భూమిని ఇచ్చిన 28 వేల మంది రైతుల త్యాగాన్ని అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. “అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అంటున్నారు. కానీ అక్కడ లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
అమరావతిలో కోటి 70 లక్షల చదరపు అడుగుల నిర్మాణ పనులు జరిగాయి. అక్కడే సచివాలయం ఉంది, అక్కడే శాసనమండలి ఉంది. అక్కడున్న సెక్రటేరియట్ లోనే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్న చట్టాలు కూడా అమరావతిలో ఉన్న శాసనసభ, శాసనమండలిలోనూ తయారయ్యాయని తెలిపారు.
రాత్రిపూట రసాయనాలను వదిలేస్తున్నారు: రేవంత్ రెడ్డి