తాజాగా తొమ్మిది మంది సీనియర్ నటీమణులతో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. కాజోల్ ముఖ్యపాత్రలో నటించగా నేహా ధూపియా, నీనా కులకర్ణి, శృతీహాసన్, ముక్తా బావ్రే, రామా జోషీ, శివానీ రఘువంశీ, సంధ్య మాట్రే, రసశ్విని దయమ ప్రధాన పాత్రలు పోషించారు.ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్కు ‘దేవి’ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో భిన్న నేపథ్యాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే గదిలో ఉన్నారు. రెండు కత్తులు (కొప్పులు) ఒక ఒరలో ఇమడవు అన్న చందాన విభిన్న మనస్తత్వం గల వీళ్లు చిన్న చిన్న విషయాలకు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగాగా.. వారికి సర్దిచెప్తూ వారి మధ్య నలిగిపోయే మధ్యవర్తిగా కనిపిస్తోంది కాజోల్.అసలు ఈ తొమ్మిది మంది మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లను ఎందుకు ఒకే గదిలో నిర్భందించారు? ఎవరు ఈ పని చేసుంటారు? పై విషయాలన్నిటీకీ క్లారిటీ రావాలంటే మార్చి 2 వరకు ఆగాల్సిందే. ట్రైలర్ ఆకట్టుకుంటోందని, ఇంతమంది తమ అభిమాన నటులను ఒకేసారి చూడటం నిజంగా కనుల విందేనని కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్. ‘దేవి’ అనే టైటిల్ పేరే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఇక స్టోరీ ఇంకెంత శక్తివంతంగా ఉంటుందో చూడాలి.
next post