telugu navyamedia
రాజకీయ వార్తలు

సరైన విషయం చెబుతా.. మీరేం బాధపడకండి: ఫడ్నవీస్

Fadnavis cm maharashtra

మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ తో కలవడంపై ఆయన స్పందించారు. మ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయనను విలేకరులు మాట్లాడించే ప్రయత్నం చేశారు. అజిత్ పవార్‌తో కలవడం మీరు చేసిన పొరపాటుగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… ‘నేను సరైన సమయంలో సరైన విషయం చెబుతాను. మీరేం బాధపడకండి’ అంటూ సమాధానం ఇచ్చారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీ నేత ఫడ్నవీస్ చివరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. , రేపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి.

Related posts