telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తుముకూరు నుండి దేవెగౌడ .. పోటీకి సిద్ధం..

devegowda demanded atleast 10 mp seats

జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, తుముకూరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ వెల్లడించింది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్టు పేర్కొంది. దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఆ సీటును వదులుకున్నారు.

హసన్ సీటును జేడీఎస్‌కు కేటాయించడంపై ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఎస్‌పీ ముద్దహనుమేగౌడ గుర్రుగా ఉన్నారు. పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని హెచ్చరించారు. దీనితో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించేందుకు నిరాకరిస్తుండడంతో దేవెగౌడ పరిస్థితి సంకటంగా మారింది. మరోవైపు, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఎ.మంజు హసన్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Related posts