దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లోఅనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన అపార అనుభవశీలి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అనూహ్యరీతిలో ఓటమిపాలయ్యారు. కర్ణాటకలోని తుముకూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగిన దేవెగౌడను బీజేపీ అభ్యర్థి బసవరాజ్ ఓడించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా సేవలు అందించిన దేవెగౌడ ఓటమితో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోవైపు, దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ సైతం ఓటమిబాటలో పయనిస్తున్నాడు. మాండ్య నుంచి పోటీచేసిన నిఖిల్ పై సినీ నటి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. భర్త అంబరీష్ మరణంతో మాండ్య నుంచి సుమలత ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. యూపీలోని రాంపుర్ లోక్ సభ నుంచి బేజీపీ నుంచి బరిలోకి దిగిన జయప్రద వెనుకంజలో ఉన్నారు.
అమరావతి పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు