telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనాతో బీఎంసీ డిప్యూటీ కమిషనర్ మృతి

Corona

దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనాతో తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. మృతునిలో పెద్దగా లక్షణాలేమీ కనపడకపోగా, ఈ ఉదయం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వైద్య బృందం ఇంటికి చేరుకునే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతోనే మృతి చెందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రస్థితిలో ఉంది. ఇప్పటివరకు ఈ నగరంలో 82,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,969 మంది మరణించారు.

Related posts