ముంబైలో ఉన్న దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని వేలం ద్వారా విక్రయించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ముంబైలోని డిమాండ్ ప్రాంతంలోనిబాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో దాదాపు 2,876 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న దేనా బ్యాంక్ భవంతిని వేలం వేస్తున్నట్టు తెలిపింది. ఇందుకోసం రూ. 530 కోట్లకు వేలం వేయాలని భావిస్తూ పత్రికా ప్రకటన ద్వారా బిడ్లను ఆహ్వానించింది.
రిజర్వ్ ప్రైస్ పై అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి భవంతి దక్కనుంది. ఈ భవంతి బిల్ట్ అప్ ఏరియా 9,953 చదరపు మీటర్లని బ్యాంకు పేర్కొంది. అక్టోబర్ 18న వేలం నిర్వహిస్తామని, భవంతిలోని మూవబుల్ ఫర్నీచర్ మాత్రం ఆస్తిలో భాగం కాదని స్పష్టం చేసింది. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ విలీనమైన సంగతి తెలిసిందే.
అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రంపై.. సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు