telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేసిన ఢిల్లీ యూనివర్సిటీ

Degree exams TDP questiona Anantapur

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను 10కి బదులు 9.5తో గుణించి పర్సేంటేజీ తీసుకుంటోంది. సీజీపీఏను 10తో గుణించి పర్సేంటేజీ తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఏపీ విద్యార్థుల అడ్మిషన్లను ఢిల్లీ యూనివర్సిటీ నిలిపివేసింది. ఏపీ నుంచి అడ్మిషన్ల కోసం 500 మంది విద్యార్థులు తరలివచ్చారు. రెండు రోజులుగా విద్యార్ధులు ఢిల్లీలో ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Related posts