దట్టంగా కమ్ముకున్న మంచు కారణంగా అదుపు తప్పిన ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకోండి. సంబల్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ కారు గ్రేటర్ నోయిడా వద్ద అదుపు తప్పి ఓ కాల్వలోకి దూసుకెళ్లింది.
మంచు కారణంగా ముందున్న దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స