telugu navyamedia
Uncategorized

ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్త‌గా 4,235 మందికి పాజిటివ్

Corona

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కొత్త‌గా 4,235 క‌రోనా కేసులు న‌మోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,18,304కు చేరుకుంద‌ని వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది.

ఈ రోజు 3,403 మంది వ్యాధి నుంచి కోలుకోగా ఇప్ప‌టివ‌ర‌కు 1,84,748 మంది రిక‌వ‌ర్ అయ్యారు. తాజాగా 29 మంది క‌రోనా సోకి మృతి చెంద‌గా మొత్తం 4,744 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం 28,812 యాక్టీవ్ కేసులున్నాయని వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Related posts