telugu navyamedia
రాజకీయ

అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట: కేజ్రీవాల్

chandrababu delhi diksha today
అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్టని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రధాని మోదీ హామీ ఇచ్చిన అమలు చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు. 
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు పోరాటానికి ఆప్ మద్దతు ఇస్తుందన్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.కాగా ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటదీక్షకు జాతీయ నేతలు సంఘీభావం తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నేతలు మోదీని నిలదీశారు. చంద్రబాబు పోరాటానికి జాతీయస్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. మోదీని గద్దె దించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటన చేశారు.

Related posts