మార్కెట్లలో షాపులు తెరిచేందుకు ఇన్నాళ్లూ సరిబేసి విధానాన్ని అమలు చేశామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కానీ ఇప్పుడు అన్ని షాపులను తెరుచుకోవచ్చు అని సీఎం తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బార్బర్ షాపులు, సెలూన్లను తెరవనున్నట్లు చెప్పారు. స్పాలు మాత్రం మూసి ఉంటాయాని స్పష్టం చేశారు. ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణికుల సంఖ్యపై ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు
వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సర్వీసుల మాత్రం మినహాయింపు కల్పించినట్లు కేజ్రీవాల్ చెప్పారు. పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ సరిహద్దులు తెరువాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.