telugu navyamedia
రాజకీయ వార్తలు

తనపై 9 సార్లు దాడులు జరిగాయి: కేజ్రీవాల్

Kejriwal AAP MLA Baldev Singh Resign

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కిశోర్ అనే యువకుడు శనివారం దాడిచేసిన సంగతి తెలిసిందే. మోతీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ చెంపపై అతను బలంగా కొట్టాడు. ఈ విషయమై కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తనపై 9 సార్లు దాడులు జరిగాయని కేజ్రీవాల్ తెలిపారు.

భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిపై ఇన్నిసార్లు దాడులు జరగలేదని వ్యాఖ్యానించారు. భారత్ మొత్తంమీద కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే బీజేపీ నేతల చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీనే ఈ దాడి చేయించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని బీజేపీ పై మనీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts