telugu navyamedia
రాజకీయ వార్తలు

సందర్శనార్థం కాంగ్రెస్‌ కార్యాలయానికి షీలా దీక్షిత్‌ పార్థీవదేహం

sheela dikshit

కాంగ్రెస్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పార్థీవ దేహాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం కార్యాలయంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఘాట్‌లో జరిగే అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్ర‌క‌టించింది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ దవాఖానకు తరలించారు. వైద్యుల బృందం చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో నిన్న‌ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఆమె భర్త వినోద్‌ దీక్షిత్‌ కొన్నేళ్ల కిందట గుండెపోటుతో మరణించారు. 

Related posts