telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ : నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అక్షరాలా నిజమవుతున్నాయి. ఓటింగ్ అనంతరం రిలీజ్ చేసిన అన్నీ సర్వేలు ‘ఆప్‌’దే ఢిల్లీ అని తేల్చేశాయి. తొలి ఫలితం రాకమునుపే ఎగ్జిట్స్ పోల్స్‌ చెప్పినట్లుగానే ఆప్‌ దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాల్లో ఆప్ 52 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 18 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులు కానీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ముందంజలో లేకపోవడం.. అంతేకాదు వందల్లోనే వారికి ఓట్లు పోలవ్వడం గమనార్హం. మొత్తానికి చూస్తే.. ఆప్ ఇదివరకు గెలిచిన స్థానాల కంటే మరిన్ని పెంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు మాత్రం మునుపటికీ ఇప్పటికీ రాజధానిలో బలపడ్డామని.. ఈ ఫలితాలతో తామేం కోల్పోలేదని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంతవరకూ ఒక్కరు కూడా స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదు.

ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్పాయంటే…
రిపబ్లిక్ టీవీ 
ఆప్ 48 – 61
బీజేపీ 9 – 12
కాంగ్రెస్ 0 – 1

ఇండియా టీవీ
ఆప్ 44
బీజేపీ 26
కాంగ్రెస్ 0

టైమ్స్ నౌ
ఆప్‌ 44
బీజేపీ 26
కాంగ్రెస్ 0

న్యూస్ 18
ఆమ్‌ఆద్మీ పార్టీ 44
బీజేపీ 26

సుదర్శన్ న్యూస్‌
ఆప్‌ 40 – 45
బీజేపీ 24 – 28
కాంగ్రెస్ 2 – 3

Related posts