ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలకు ఇప్పటివరకు 1528 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన ఒక్క మంగళవారం రోజే 800 నామినేషన్లు వేశారు. మొత్తం అభ్యర్థుల్లో 187 మంది మహిళలున్నారు. నామినేషన్ల విత్డ్రాకు శుక్రవారం వరకు గడువుందని ఢిల్లీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానంగా ఆమ్ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పోరు జరుగనుంది.