ఏపీలో డిగ్రీ పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ పరీక్ష పేపర్ లో ఓ ప్రశ్నను చూసిన విద్యార్థులు ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పొలిటికల్ సైన్స్ పేపర్ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న ప్రశ్న ఇవ్వడంతో పరీక్షకు హాజరైన వారు ఖంగుతిన్నారు. అటానమస్ హోదా ఉన్న ఈ కాలేజీ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుంటుంది.
బీఏ సెకండ్ ఇయర్, నాలుగో సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో ఎనిమిది అంశాలను ఇస్తూ, అందులో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం రాయాలని చెబుతూ, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులను యూనివర్సిటీ కేటాయించింది. బాధ్యతాయుత ప్రభుత్వం, భారత ఉప రాష్ట్రపతి, మంత్రిమండలి, సంకీర్ణ ప్రభుత్వం, ఎన్నికల సంస్కరణలు, తెలుగుదేశం పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టం అంశాలను ఇస్తూ, అందులో ఐదు ఎంచుకోవాలని కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలా ఓ పార్టీ గురించి రాయాలనడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అంటూ, పలువురు విద్యార్థులు ప్రశ్న పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. దత్తత్రేయ డిమాండ్