బాలీవుడ్ నటులు దీపిక పదుకొనె, రణవీర్సింగ్ వివాహం చేసుకుని ఈరోజుకి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ దంపతులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన వీరు, రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేసారు. ఈరోజు ఉదయం విఐపీ విరామ సమయంలో సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి వెళ్లి, గర్భగుడిలోని శ్రీవారి మూలవిరాట్ను దర్శించుకున్నారు, అనంతరం హుండీలో కానుకలు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన దీపిక, రణ్వీర్లను చూడటానికి అభిమానులు పోటీ పడ్డారు.
previous post