యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఛపాక్”. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. సినిమాకు నిర్మాతగా కూడా దీపిక వ్యవహరించారు. శుక్రవారం ముంబైలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపికతో పాటు లక్ష్మీ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఈ చిత్రంలోని పాట పాడుతుండగా స్టేజీపై ఉన్న లక్ష్మీ చాలా ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న దీపిక ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఒకానొక సందర్భంలో దీపిక కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post