telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఏప్రిల్ 15 వరకు డీఈఈ సెట్‌ దరఖాస్తుకు గడువు

తెలంగాణ రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) కాలేజీల్లో సీట్ల భర్తీకి మే 22న నిర్వహించే డీఈఈసెట్- 2019 దరఖాస్తుల గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు కన్వీనర్ ఏ సత్యనారాయణ తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4తో గడువు ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉందని, గడువు పొడిగించామని తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు www.deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలని, సందేహాలకు 75698 74190 నంబరుకు ఫోన్‌ చేయాలని తెలిపారు.

Related posts