అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా వైరస్తో మృతి చెందాడన్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దావూద్, అతడి భార్య మెహజబీన్ కరోనా బారిన పడి పాకిస్తాన్లోని కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్ మృతి చెందాడని పేర్కొంది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే దావూద్ మృతిపై సరైన సమాచారం లేకపోయినా.. వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే దావూద్ సోదరుడు అనీఫ్ ఇబ్రహీం ఈ వార్తలను ఖండించాడు. దావూద్ కు కానీ, తమ కుటుంబంలోని ఇతర సభ్యులకు కానీ కరోనా పాజిటివ్ రాలేదని చెప్పాడు.