telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫిలింఛాంబర్‌లో దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు

Dasari

దర్శకరత్న దాసరి నారాయణరావుగారి 3వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లోని ఆయన విగ్రహానికి విగ్రహానికి హీరో శ్రీకాంత్, నిర్మాత సి. కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని దాసరి‌గారు వేరే రకంగా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు అనేది ఉండదు. ఏ సమస్య వచ్చినా ముందువుండే వ్యక్తి దాసరిగారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. ఈరోజు ఆయన మూడో వర్ధంతి సందర్భంగా 200 నుండి 300 మందికి అన్నదానం చేస్తున్నాము. వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తాము..’’ అని తెలిపారు.

‘‘ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి గారు. ఎటువంటి విషయాలు అయినప్పటికీ వ్యవస్థలను ముందు పెట్టి ఆయన నడిపించేవారు. ప్రతి సినిమా టెక్నీషియన్‌కు నటుడికి విలువ ఇచ్చి మాట్లాడేవారు. ఆయన లేని లోటు తెలుస్తోంది. ఈ కరోనా సనయంలో మరింతగా ఆయన లోటు కనిపిస్తోంది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చెయ్యలేరు..’’ అని అన్నారు ప్రసన్న కుమార్.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. దాసరిగారి మీద వున్న అపారమైన ప్రేమతో ఈ రోజు ఆయన 3వ వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగించాము. నేను బతికి ఉన్నత కాలం దాసరిగారి పుట్టినరోజు మే 4, దాసరిగారి వర్ధంతి మే 30 కచ్చితంగా ఇక్కడ జరుపుకుంటాను. ప్రతి సంవత్సరం దాసరి అవార్డ్స్ కొనసాగించుతాను, ఈ ఫంక్షన్‌ను దాసరి కుటుంబ సభ్యులు, మరియు శిష్యులు సమక్షంలో చేస్తానని తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘దాసరిగారి లేని లోటు పూడ్చలేము ఇక్కడ ఉన్న నేను కానీ, సి. కళ్యాణ్ కానీ, రామ సత్యనారాయణ కానీ ఆయన దగ్గర పనిచేయలేదు. అయినా సరే ఆయన మనుష్యులమే అని గర్వంగా చెప్పుకుంటాం. ఆయన వర్ధంతి రోజున ఇలా ఆయనను స్మరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, దొరై రాజా వన్నెం రెడ్డి, సత్తుపల్లి తాండవ, పిడివి ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts