ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు నిన్న ఉదయం తిరుపతిలో వందలాది మంది విద్యార్థులు, తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో… పోలీసులు మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా ఈ విషయంపై దాసరి నారాయణరావు పెద్ద కోడలు దాసరి సుశీల మండిపడ్డారు. దాసరి గురువు అని చెప్పుకుని తిరిగే మోహన్ బాబు మోసం చేశారని, దాసరి చనిపోగానే ఆస్తులను అందరికీ సమానంగా పంచుతామని చెప్పి ఇప్పటివరకూ ఆ పని చేయలేదని, అందువల్ల తన కొడుకు మాస్టర్ దాసరి రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు సుశీల. దాసరి మనవడికి న్యాయం చేయలేని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారని, పేదలకు ఉచిత విద్య ముసుగులో ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు సుశీల. మరి ఆమె ఆరోపణలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
next post
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం: రవితేజ