ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకుల్లోను, మీడియా లోను చర్చ జరుగుతుంది. రాధాకృష్ణ ఇటు కేసీఆర్ కు అటు చంద్ర బాబుకు అత్యున్నత సన్నిహితుడు . రెండు రాష్ట్రాల్లోనూ తన హవా కోన సాగిస్తున్నాడు .
రాజకీయంగా ఎప్పుడు ఎవరిని పైకి ఎత్తుతాడో , ఎవరిని క్రిందికి తొక్కుతాడో … తెలియదు . కొంత కాలం కేసీఆర్ తో విరోధం పెట్టుకున్నాడు . ఆ తరువాత కేసీఆర్ కు దగ్గరై తన పత్రిక , ఛానల్ లో ఆయనకు అనుకూలంగా వార్తలు రాస్తున్నాడు . ఇక చంద్ర బాబు నాయుడుతో రాధాకృష్ణ పరిచయం ఇప్పటిది కాదు .
చంద్ర బాబు మంత్రిగా వున్నప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మొదలైంది . రాధాకృష్ణ మాటను చంద్ర బాబు గౌరవిస్తాడు . రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర రాజకీయాల్లో రాధాకృష్ణ జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు ఎప్పటినుంచో వెలువడుతున్నాయి . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాధాకృష్ణ పత్రికకు, ఛానెల్ కు చంద్ర బాబు ఆర్ధికంగా మేలు చేస్తున్నాడనే ఆరోపణలు వున్నాయి .
ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు రాధాకృష్ణ ఎక్కడెక్కడ ముడుపులు తీసుకుంటున్నాడో చెప్పేశాడు . చంద్ర బాబు పేరు ఉపోయోగిందిసుకొని అడ్డంగా సంపాదిస్తున్నాడని వెంకటేశ్వర రావు ఆరోపణ. . చంద్ర బాబు నాయుడు పై అసూయ , ఈర్ష్య తోనే తన కుమారుడిని జగన్ పార్టీలో చేర్చుతున్నట్టు రాధ కృష్ణ రాయడం జర్నలిజం లో ని విలువలను దిగ జార్చడమేనని దగ్గుబాటి ఘాటుగా సమాధానము చెప్పాడు .
పోలవరం , పట్టిసీమ , హంద్రీ నీవా , అమరావతి అన్నింటిలోనూ రాధ కృష్ణకు కమీషన్లు వెడుతున్నాయని దగ్గుబాటి పేర్కొన్నారు . మారుతున్న రాజకీయ పరిణామాలు చూసి రాధాకృష్ణ సహించలేకపోతున్నాడని , బాబుకు అధికారం రాకపోతే తనకు వచ్చే కమీషన్లు అన్నీ ఆగిపోతాయని బాధపడుతున్నాడని , అందుకే ఎలాంటి రాతలు రాస్తున్నాడని దగ్గుబాటి ధ్వజం ఎత్తాడు . మొత్తానికి రాధాకృష్ణ నిజ స్వరూపాన్ని దగ్గుబాటి వెంకటేశ్వర రావు బయట పెట్టాడు .
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్