నేడు మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుందని, మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని ఆయన అంచనా వేశారు.
నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత ఇదే తొలి అల్పపీడనం కావడంతో, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ ఖరీఫ్ లో ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతాంగం, ఈ సీజన్ ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.