‘ఫని’ తుఫాను బీభత్సంతో పూరీ జిల్లాలో పలు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. మరణించిన వారి సంఖ్య 21కి చేరినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తుఫాను నేపథ్యంలో శనివారం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను బాధితులకు 15 రోజుల వరకు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.తుఫాను ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుండటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.
మరోవైపు భారీ వర్షాలతో తీర ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి.అనేక జిల్లాల్లో భారీ ఆస్తినష్టం సంభవించింది. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టవర్లు కూలడంతో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. సోమవారం ప్రధాని నరేంద్రమోడీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.