సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు.
అమెజాన్, స్విగ్గీ, ఫుడ్ పాండా వంటి సంస్థల పేర్ల పేరిట ఫోన్ నెంబర్లను ఇంటర్ నెట్ లో పెట్టి మోసాలకు పాల్పడుతున్నరని తెలిపారు. ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. స్విమ్ స్వాపింగ్ చేయడంలో నిందితులు దిట్ట అని, రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.