telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సైబర్ నేరగాళ్ల ముఠా సభ్యులు అరెస్టు

New couples attack SR Nagar

సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు.

అమెజాన్, స్విగ్గీ, ఫుడ్ పాండా వంటి సంస్థల పేర్ల పేరిట ఫోన్ నెంబర్లను ఇంటర్ నెట్ లో పెట్టి మోసాలకు పాల్పడుతున్నరని తెలిపారు. ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. స్విమ్ స్వాపింగ్ చేయడంలో నిందితులు దిట్ట అని, రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

Related posts