telugu navyamedia
క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. వెయిట్‌లిప్టింగ్‌లో బింద్యారాణికి రజతం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ మ‌రో పతకం లభించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి రజతం సొంతం చేసుకున్నది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవిరెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ సాధించింది. రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్‌ అండ​ జెర్క్‌ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.

అయితే క్లీన్‌ అండ్‌ జర్క్‌ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్‌లో పుంజుకున్న బింద్యారాణి .. 116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది.నైజీరియాకు చెందిన అడిజట్‌ ఒలారినోయ్‌ 117 కిలోల బరువెత్తి గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

ఒలారొనోయ్‌(స్నాచ్‌ 92 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోలవాల్సి వచ్చింది. ఇక లోకల్‌ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్‌, 109 క్లీన్‌ అండ్‌ జెర్క్‌) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది.

కాగా, బింద్యారాణి పతకం సాధించడంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మెడల్స్‌ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం.

స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను స్వర్ణ పతకాన్ని సాధించ‌గా, అనంతరం జరిగిన 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజాారి కాంస్య పతకం సాధించాడు. గురురాజ్ పుజారి మొత్తంగా 269 (118+151) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ కు కామన్వెల్త్ గేమ్స్ లో ఇది రెండవ పతకం కావడం విశేషం.మలేసియా లిఫ్టర్ మహ్మద్ బిన్ బిడిన్ 285 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. పపువా న్యూగినియా లిఫ్టర్ బరు 273 కేజీల బరువు ఎత్తి రజత పతకం సాధించాడు.

Related posts