హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దోహా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అక్రమంగా తరలిస్తున్న 1,900 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.36,99,782 ఉంటుందని అధికారు అంచనా వేశారు.
previous post
next post