హిమాచల్ప్రదేశ్లో మొత్తం ఇప్పటి వరకు 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
సామాన్యులకు, వృద్ధులకు ఉదయం పూట నడక కోసం వెసులుబాలుకల్పించినట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల దుకాణాలు, కూరగాయల, అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రజలు బౌతిక దూరం పాటించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జనం ఒక్కదగ్గర గుమికూడకుంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.