telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసింది. దీపక్ చాహర్ పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పంజాబ్ జట్టు ముఖ్యమైన నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ రాహుల్ రన్ ఔట్ గా వెనుదిరిగాడు. కానీ పంజాబ్ జట్టు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ కారణంగా ఆ జట్టు 100 పరుగులను దాటింది. ఆటగాళ్లు అందరూ వరుసగా ఔట్ అవుతున్న చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 47 పరుగులు చేసిన షారుఖ్ ఐపీఎల్ లో తన మొదటి అర్ధశతకానికి 3 పరుగుల దూరంలో చివరి ఓవర్ మొదటి బంతికి పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో చాహర్ 4 వికెట్లు తీయగా మొయిన్ అలీ, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై గెలవాలంటే కేవలం 107 పరుగులు చేస్తే చాలు. అంటే బాల్ టి బాల్ కంటే తక్కువ టార్గెట్. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts