telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

subramanyam cs

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏయే శాఖలు ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎస్‌ దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షకు డీజీపీ ఠాకూర్, విజయవాడ సీపీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, ప్రొటోకల్ డైరెక్టర్ అశోక్‌బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్‌ రామారావు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐఎస్‌డ్ల్యూ డీఐజీ రామకృష్ణ, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, స్పెషల్‌ సీఎస్‌ రమేష్‌, ఆర్అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిరబ్‌ కుమార్‌ ప్రసాద్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts