దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్న ఎన్నికల లెక్కింపు మే 23న జరగనుంది. దానికి తగిన ఏర్పాట్లు పటిష్టంగా పూర్తిచేయాలని నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లకు ఆదేశాలు జారీచేశారు.
లెక్కింపు సిబ్బందికి తగిన శిక్షణలో రాజీపడొద్దని సీఎస్ అన్నారు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే అన్ని దారులలో రక్షణ మెరుగైనదిగా ఏర్పటు చేయాలని, ఆరోజు కానీ, అనంతరం కానీ అల్లర్లు జరగకున్న పటిష్ట బందోబస్తుతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
సిబ్బందికి కూడా ఎక్కడ లోటు లేకుండా తాగునీరు సహా ఏర్పాట్లు చేయాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, తాగునీరు, పశుగ్రాసం వంటి వాటికి లోటు లేకుండా, త్వరితగతిన స్పందించాలని ఆయన అన్నారు.