73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గొల్కొండ కోటపై తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయలలోపు రైతుల రుణమాఫీకి ఈరోజు ఉత్తుర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
మన రైతుబంధు, రైతు బీమా పథకాలు వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యేగొప్ప కార్యక్రమాల జాబితాలో ఐక్యరాజ్యసమితి చేర్చడంతో మన రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి పెరిగిందన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి