telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హత్యకు 55,000, కొట్టడానికి 5,000 మాత్రమే..పోస్టర్ కలకలం

హోటల్‌కి వెళ్లినప్పుడు మనం మెను కార్డులు చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు నేరాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. లేదంటే ఓ సారి ఉత్తరప్రదేశ్‌ ముజఫర్ నగర్ వెళ్లండి. అక్కడ మీకు ఓ గ్యాంగ్‌ కనిపిస్తుంది. కిడ్నాప్‌, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. కాకపోతే వారు డిసైడ్‌ చేసినంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఏ క్రైమ్‌కి ఎంత చార్జ్‌ చేస్తారో వివరిస్తూ ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. దాని మీద ధమ్కి(బెదిరించడానికి)కి 1000 రూపాయలు, కొట్టడానికి 5,000 రూపాయలు, ఎవరినైనా గాయపర్చడానికి 10,000 రూపాయలు.. హత్యకు 55,000 రూపాయలు మాత్రమే అంటూ ఈ గ్రూపు పోస్టర్‌ విడుదల చేసింది. దాని మీద ఓ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా.. పక్కనే మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఇక ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరంతా చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరిలో ఓ యువకుడు పీఆర్‌డీ జవాన్‌ కుమారుడిగా తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కేసు నమోదు చేశాం. సదరు యువకులను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Related posts