పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి డెంగీ జ్వరంతో మృతి చెందింది. చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావ్య(18) అనే యువతికి గత గురువారం వివాహం కావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు బుధవారం పెళ్లి కూతురిని చేసే క్రమంలో నలుగు పెడుతుండగా స్పృహ తప్పి పడిపోయింది.
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తమిళనాడులోని షోళింగర్ ప్రభుత్వాసుపత్రికి తరక్లించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ఆమె మృతి చెందింది. డెంగ్యూ జరంతో మృతి చెందినట్లు సీఎంసీ వైద్యులు ధ్రువీకరించారు.