ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బీసీసీఐ అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం… శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం చాలా కఠినమైనదిగా అభివర్ణించింది. మూడు నెలల్లోగా శ్రీశాంత్ నిషేధంపై మరో నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది.
2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడుతూ పట్టుబడ్డాడు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. టీం ఇండియా తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ-20 మ్యాచులు ఆడాడు. అంతేకాక.. ఇటీవల హిందీ బిగ్బాస్లో పాల్గొన్న శ్రీశాంత్ ఆ సీజన్ రన్నర్ అప్గా నిలిచాడు.