టీడీపీ ధినేత చంద్రబాబు ఎంతో కష్టపడినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం గజదొంగలుగా తయారయ్యారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఈ విషయాన్ని తాను అప్పట్లోనే బాహాటంగా చెప్పానని గుర్తుచేశారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లు ఖాళీగా ఉండి, చివర్లో సంక్షేమ పథకాలు అమలుచేస్తే ప్రయోజనం ఏముంటుందన్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రెండున్నర సంవత్సరాల ముందు నుంచి ప్రణాళిక సిద్దం చేసుకొని విజయం సాధించారని నారాయణ విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని తాము కోరామనీ, కానీ చంద్రబాబు వినిపించుకోలేదని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగాలని ఆయన కోరుకున్నారనన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఫ్రంట్ గా ఏర్పడి ముందుకు పోవాలని వామపక్ష పార్టీలు భావించాయని చెప్పారు. అయితే అది ఎన్నికల్లో సఫలీకృతం కాలేదని పేర్కొన్నారు.
పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ: కత్తి మహేశ్