ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనతో హైదరాబాద్ లో స్థిరాస్తి వెంచర్ల రేట్లు పెరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి చేస్తోన్న ఆందోళనకు నారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని నారాయణ విమర్శించారు.
తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారని, ఆంధ్రవాళ్ల కోసం కాదని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు జగన్కు ధన్యవాదాలు తెలిపారని నారాయణ అన్నారు.జగన్ 30 ఏళ్ల సీఎం కాదని, మూడేళ్ల సీఎంలా కనపడుతున్నారని చురకలంటించారు. రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా ఉంటానని జగన్ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి