ఈ నెల 26 నుంచి ఇందిరా పార్కు వద్ద ఆర్టీసీ పరిరక్షణకు, కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరినప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, అధికార పార్టీ నాయకులు కూడా వీటిని వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల గెలుపు శాశ్వతం కాదని, తెలంగాణ గడ్డపై నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అహంకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవి లో ఉండి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మూసి వేస్తామని నియంతలా మాట్లాడటం పై మండి పడ్డారు. ఆర్టీసీ సంరక్షణ, వేతనాలు ఇవ్వాలని, ప్రజలకు మంచి జరగాలని… ప్రజాతంత్ర, కార్మిక హక్కులను కాపాడాలని ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.
40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్