telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదు: చాడ వెంకట్ రెడ్డి

chada venkat reddy cpi

సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సరూర్‌నగర్‌లో టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సకల జన భేరీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సెల్ఫ్ డిస్మిస్ పేరుతో 48వేల మంది కార్మికులను మనోవేదనకు గురిచేశారంకేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వనించాలని చాడ డిమాండ్ చేశారు.

Related posts