ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో పాల్గొంటున్నారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆమె షూటింగ్ చేస్తున్నారు. అయితే పాయల్ తాను కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను శనివారం పాయల్ రాజ్పుత్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ వీడియోలో ఆరు నెలల తరవాత తిరిగి షూటింగ్లో పాల్గొన్న పాయల్.. సెట్స్లో టెస్ట్ చేయించుకోవడానికి భయపడిపోతూ ఏడ్చేశారు. పాయల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే పాయల్ ఓవరాక్టింగ్ చేస్తున్నారని ఆమెపై ట్రోలింగ్ మొదలైపోయింది. అయితే నెటిజన్లు తనను ట్రోల్ చేయడంపై పాయల్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ “నాకు సూదులంటేనే భయం. మందులన్నా, ఇంజక్షన్ అన్నా ఆమడ దూరం పారిపోతా. అందుకే, కొవిడ్-19 కోసం చేసిన స్వాబ్ టెస్ట్ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ మాత్రం దానికి నన్ను ట్రోల్ చేయడం అన్యాయం, దారుణం. మొత్తం యూనిట్కు టెస్టులు నిర్వహించడానికి ముగ్గురు డాక్టర్లను పిలిపించారు. నేను చాలా భయపడటంతో నాకు ఆఖరిగా టెస్ట్ చేశారు. నేను బాగానే ఉన్నానని, నాకు టెస్ట్ అవసరం లేదని వాళ్లకు చెబుతూనే ఉన్నాను. కానీ, సెట్స్లో ఉన్న వాళ్లందరి భద్రత ముఖ్యమని తరవాత నాకే అనిపించింది. నా భయానికి మొత్తం యూనిట్ను బలి చేయకూడదని భావించి టెస్ట్ చేయించుకున్నాను” అని పాయల్ వెల్లడించారు.
previous post
లవ్ అనేది ఓ ఫాల్స్ ఎమోషన్… ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పిన ఆర్జీవీ