ఈ ఏడాదిలో ఎవ్వరీ జీవితం కూడా అనుకున్న తరహాలో సాటలేదు. కరోనా కారణంగా అందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే తరహాలో టాలీవుడ్ హీరో రామ్ కూడా భావించాడట. తన తల్లికి, సోదరుడికి కరోనా పోజిటివ్ వచ్చిందని తన సోదరుడికి కాస్త సీరియస్ అవ్వడంతో చాలా భయపడ్డానని రామ్ తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ ఈ ఏడాదిలో తన అనుభవాల గురించి మాట్లాడాడు. ‘ఈ ఏడాదిలో చెప్పుకోవడానికి అంతగా ఏమీ చేయలేదు. కానీ కొన్ని మంచి చేస్తే, మరి కొన్ని భయాన్ని కలిగించాయి. లాక్డౌన్ కారణంగా కుటుంబంతో గడపడానికి సమయం దొరికింది. కానీ కరోనా నన్ను చాలా భయపెట్టింది. అమ్మకి, సోదరుడికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఇంతలో సోదరుడికి కాస్త సీరియస్ వార్త వినడంతో ఇంకంతే. నా తల పనిచేయలేదు. అయితే డాక్టర్లు ఎంతో శ్రమించి చికిత్స చేయడంతో అతడు కోలుకున్నాడ’ని రామ్ తెలిపాడు. ఇదిలా ఉంటే రామ్ నటించిన తాజా చిత్రం రెడ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఇప్పడు తాజాగా వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా గణతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ అయ్యేందుకు సన్నద్దం మవుతోంది. ఈ సినిమా కోసం రామ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి వారిని సంతృప్తి పరుస్తుందేమో చూడాలి.
previous post
next post
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సెటైరికల్ పోస్ట్